Balakrishna: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో షూటింగులు మళ్లీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా షూటింగ్ అన్నిటి కంటే ముందుగానే ప్రారంభమయ్యింది. సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు రాయలసీమ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్లు సినిమా డైరెక్టర్ బోయపాటి గతంలోనే తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ షూటింగ్ లో పాల్గొన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ జరుగుతున్న టైములో కరోనా భయం లేకుండా జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారని.. వాళ్లని చూస్తుంటే చాలా భయంగా ఉందని.
వైరస్ వాళ్లకి సోకుతుంది ఏమో అన్న టెన్షన్.. షూటింగ్ సెట్ లో.. ఉన్నంతసేపు మనసులో నెలకొంది అని ఈ హీరోయిన్ తెలిపింది. భారీ స్థాయిలో వైరస్ బయట వ్యాప్తి చెందుతూ ఉండటంతో.. తనకు షూటింగ్ చేస్తున్నంతసేపు చాలా ఆందోళన నెలకొంది అని స్పష్టం చేసింది. మరో పక్క కేంద్రం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని జనాలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. మాస్కు ధరించాలని తప్పనిసరిగా ప్రభుత్వాలు వేధిస్తున్న కరోనా నిబంధనలు అనుసరించాలని తెలుపుతున్నాయి.
Read More: Akhanda : అఖండ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్..బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్న బాలయ్య
ఇటువంటి తరుణంలో షూటింగు జరుగుతూ ఉన్నా ప్రాంతాలలో జనాలు గుంపులు గుంపులుగా రావడం తో అఖండ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. కామెంట్ పెట్టడం… సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అఖండ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ ఉండటంతో పాటు కీలక యాక్షన్ సన్నివేశాలు .. కూడా మిగిలి ఉండటంతో ఈ మొత్తం వర్క్ ఈ షెడ్యూల్లో పూర్తి చేయాలి అని భావిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు బోయపాటి తో చేస్తున్న ఈ మూడో సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని.. బోయపాటి తో హ్యాట్రిక్ సాధించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!