Annasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” ఎన్నికలు అక్టోబర్ పదో తారీకు జరగనున్నట్లు “మా” ఎన్నికల క్రమశిక్షణా సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మా అధ్యక్ష పదవి కోసం.. పోటీపడుతున్న అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎక్కువ మంది పోటీ పడుతూ ఉండటం తో ఇండస్ట్రీలో సరికొత్త వాతావారణం నెలకొంది. పోటీదారులలో ఒకరైన ప్రకాష్ రాజ్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ ప్యానల్ సపోర్ట్ తమకే అని వెల్లడించారు. ఇదే టైంలో సుడిగాలి సుదీర్, అనసూయ గురించి సంచలన కామెంట్ చేశారు.
తన ప్యానల్ కి సపోర్ట్ చేసే విషయంలో అనేకమంది గురించి మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ సుడిగాలి సుదీర్ నెక్స్ట్ జనరేషన్ కి ఒక మార్గదర్శిగా నటుడిగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. అటువంటి ఎం జనరేషన్ తనతోపాటు ఈ ఎన్నికలలో పాలుపంచుకోవటం నిజంగా అభినందనీయమని.. వచ్చే జనరేషన్ కి.. గ్రేట్ ఎక్స్పోజర్.. అవుతుంది అన్న భావనతో కలిసి పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇక ఇదే టైములో అనసూయ గురించి మాట్లాడుతూ.. టెలివిజన్ రంగంలో ఎంతో పాపులర్ యాక్టర్ మాత్రమే కాకుండా అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పుకొచ్చారు. అదే రీతిలో ముక్కుసూటిగా మాట్లాడటం లో అనసూయ చాలా కరెక్ట్ అని.. అందువల్లే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లో.. అనసూయ ని చేర్చడం జరిగిందని.. ఉమెన్ రిప్రజెంటేషన్ లో కీలకమని.. మా అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది అత్యంత కీలకమైనదని.. ఇందులో 18 నెంబర్స్ ఉంటారని వారిలో అనసూయ ఒకరు అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.