ఈరోజుల్లో బైక్ లేనిదే రోజు గడవదు. మార్కెట్ కు వెళ్లాలన్నా.. చివరకు పాల ప్యాకెట్ తేవాలన్నా ఖచ్చితంగా బైక్ ఉండాల్సిందే. నడిచే రోజులు పోయాయి. నిత్యావసర పనులకు ఖచ్చితంగా బైక్ ఉండాల్సిందే. లేదంటే పనులన్నీ ఆగిపోతాయి.
జనరేషన్లు మారినట్టే మగాళ్లే కాదు మహిళలు కూడా బైకులు వాడటం మొదలుపెట్టారు. పిల్లలను స్కూల్ కు తీసుకెళ్లడం, తీసుకురావడం, మార్కెట్ కు వెళ్లడం, కూరగాయలు తేవడం, ఇతర పనుల కోసం మహిళలు కూడా టూవీలర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు.
అయితే మధ్యతరగతి కుటుంబాలు కానీ.. దిగువ మధ్య తరగతి కుటుంబాలు కానీ సడెన్ గా టూవీలర్ కొనాలంటే కష్టమే. అందులోనూ ఈ కరోనా కాలంలో చేతిలో చిల్లిగవ్వ లేదు. అందుకే.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళల కోసం మాత్రమే అదిరిపోయే టూవీలర్ లోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పీఎస్బీ పవర్ రైడ్ అనే స్కీమ్ ను ప్రారంభించిన బ్యాంక్.. ఆ స్కీమ్ ద్వారా మహిళలకు టూవీలర్ లోన్ ను అందించనుంది. 60 వేల రూపాయల లోన్ ను ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ అందించనుంది.
అయితే.. ఈ లోన్ పొందాలంటే మహిళలు ఖచ్చితంగా కనీసం ఆరు నెలల ముందు నుంచి జాబ్ చేస్తూ ఉండాలి లేదా స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లు అయినా అయి ఉండాలి.
18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ స్కీమ్ కు అర్హులు. నెలకు కనీసం 8 వేల రూపాయలు సంపాదించినా చాలు.. వాళ్లకు లోన్ అందించనుంది బ్యాంక్. ఫామ్ 16 తో పాటుగా మూడు నెలల పేస్లిప్పులను తీసుకెళ్లి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్ లోనైనా ఈ స్కీమ్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ లోన్ మంజూరు అయితే.. 3 సంవత్సరాలలోగా ఆ మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు.