రాధేశ్యామ్ .. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా గురించి డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అంతక ముందు ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని ఫ్యాన్స్ తెగ ఫీలైపోయారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఫ్యాన్స్ బాధని అర్థం చేసుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ అంటూ టైటిల్ ని అనౌన్స్ చేసి భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు. అంతే కాదు రాధేశ్యామ్ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నాడు.
దాంతో సినిమా మీద విపరీతంగా హైప్ క్రియేటయిది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. త్వరలో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ కి చమటలు పట్టిస్తుందట. అదేంటంటే రాధేశ్యామ్ సినిమాకి దర్శకుడు రివర్స్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నాడట. ఈ ఫార్మాట్ లో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకులకి అంత త్వరగా కనెక్ట్ కారన్న టాక్ ఉంది. ఇలాంటి ప్లే సినిమాకి మైనస్ అవుతుందని చాలా సినిమాల విషయంలో రుజువైంది.
ఏ సినిమా ఎందుకు ప్రభాస్ నటించిన గత చిత్రం సాహో కూడా ఇలా రివర్స్ స్క్రీన్ ప్లే తోనే సాగుతుంది. అసలే హాలీవుడ్ రేంజ్ లో తీసిన సినిమా. దానికి తోడు రివర్స్ స్క్రీన్ ప్లే అయ్యేసరికే జనాలకి అర్థం కాక సాహో ఒక్క బాలీవుడ్ తప్ప మిగతా ఏ భాషలోనూ హిట్ సాధించలేకపోయింది. ఇప్పుడు కూడా రాధకృష్ణ రాధేశ్యామ్ విషయంలో అదే ఫార్మాట్ వాడుతున్నాడని తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇప్పటి వరకైతే రాధేశ్యామ్ మీద ఊహించని విధంగా అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ తో సెట్స్ మీదకి రానున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!