ఏపీ సీఎం జగన్ కి వ్యతిరేకంగా మొన్నటి వరకు ఓ వర్గం మీడియా కి ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక అవినీతి ఆరోపణలు పార్టీ నేతల పై చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఏకంగా వైయస్ జగన్ ని టార్గెట్ చేసి రఘురామకృష్ణంరాజు కొన్ని చానల్స్ లో సెటైర్లు కూడా వేయడంతో ఆయనకి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. అయితే పార్టీ లెటర్ హెడ్డింగ్ వేరేలా ఉంది అని ఇక్కడ మీడియా ముందు నానా హడావిడి చేసి ఢిల్లీలో తేల్చుకుంటామని రఘురామ కృష్ణం రాజు ఇటీవల కేంద్ర పెద్దలను కలవడం జరిగింది. మరి ఎంతో సీరియస్ గంభీరం ఇక్కడ ప్రదర్శించిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత తన టార్గెట్ ‘వ్యూ’ ప్రజెంట్ మార్చినట్లు ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి అర్థమవుతుంది.
రఘురామకృష్ణంరాజు పొలిటికల్ వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం చాలావరకు మొదటిలో పెద్దగా పట్టించుకోనట్లు ఉన్నా, ఇటీవల గట్టిగా కాన్సెంట్రేషన్ చేయటంతో పూర్తిగా జగన్ మరియు రఘురామకృష్ణంరాజు వివాదం సరికొత్తగా ఆవిష్కృతమవుతుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇటీవల జరిగిన పరిణామాల విషయంలో వైయస్ జగన్ కి రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు. ఆ లెటర్ యొక్క సారాంశం పరిశీలిస్తే తనని యాంటీ క్రిస్టియన్ గా చిత్రీకరించడానికి మీ చుట్టూ ఉన్న మనుషులు ప్రయత్నించారని తెలిపారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పైన నేను చేసిన వ్యాఖ్యలు కొంత మంది వక్రీకరించారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఇప్పటివరకు ఎప్పుడు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని లెటర్ లో తెలిపారు. మీరు అవకాశం కుదిరితే అపాయింట్మెంట్ ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు లెటర్లో జగన్ ని కోరారు.
ఇంత వరకు బాగానే ఉన్నా ఈ లెటర్ రిలీజ్ చెయ్యక ముందు రఘురామకృష్ణంరాజు ఒక ఆడియో ని సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. అది ఏమిటంటే చైనాతో కనుక మనకు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మోడీ గెలుస్తారు అంటూ ఓ ఆడియో సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో చాలామంది ఆ సాంగ్ విని రఘురామకృష్ణంరాజు అయితే త్వరలో బీజేపీలోకి వెళ్తున్నారా అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ ఆడియో ఎవరో ఫార్వర్డ్ చేశారు నేను కూడా ఫార్వర్డ్ చేశాను…అని సమాధానం ఇచ్చారు. ఇలాంటి సమయంలో ప్రధానికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉంది దానిలో తప్పేముంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో పొలిటికల్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.