ఈ మధ్య శ్రీనగర్ న్యూస్ ఎక్స్ ప్రెస్ తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టింది. ఆ పోస్టు దేశంలో బాగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా ఐరాస కూడా ఒకింత ఆందోళనకు గురయ్యే పోస్టు అది. ఇంతకు విషయం ఏమిటయ్యా అంటే..!!జమ్మూ కస్మీర్ ప్రత్యేల దేశమట. దీన్ని ఐరాస గుర్తించందట. ఈ ఫేస్ బుక్ పోస్టుకి అఫ్జర్ బట్ అనే వ్యక్తి ట్వీట్ చేసాడు. ఒక మ్యాప్ కూడా సృష్టించి, ఇది ఐరాస విడుదల చేసింది అని పేర్కొన్నాడు. ఇది సంచలనంగా మారింది. ఐరాసకు బాగా డౌట్ వచ్చింది. వెంటనే తేరుకుంది.
వెంటనే ప్రపంచ పటాన్ని పరిశీలించింది. నిజానికి ఆ మ్యాప్ లో భారత్, పాక్ మధ్య విభజన రేఖ దగ్గర కొన్ని చుక్కలు ఉన్నాయి. ఇవి జమ్మూకాశ్మీర్ ని విడదీసేలా కనిపిస్తున్నాయి. అందుకే పొరపడి కొందరు అత్యుత్సాహంతో జమ్మూకాశ్మీర్ ని ప్రత్యేక దేశం అనుకుంటున్నారేమో అని ఐరాస తెలుసుకుని, వెంటనే అది దేశం కాదు.., పుకార్లు ఆపండి అంటూ హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేసిన వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఈ ఫాక్ట్ చెక్ ని టైమ్స్ నౌ టీమ్ ధృవీకరించింది. అందుకే సోషల్ మీడియాలో వార్తలు పట్ల అప్రమత్తంగా ఉండాలి అనేది.