black fungus: కరోనా కల్లోలం సమయంలో ప్రతి వార్త కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే, అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గకపోగా , బ్లాక్ ఫంగస్ , వైట్ ఫంగస్ పేరుతో కొత్త కొత్త సమస్యలు ప్రజలు వణికిపోయేలా చేస్తున్నాయి. కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ప్రజలను భయపెడుతున్నాయి. మరణాల సంఖ్య సైతం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ ప్రచారం ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. అదే ఉల్లిగడ్డలతో బ్లాక్ ఫంగస్.
Read More : Black fungus: షాక్ః కరోనా రాకపోయినా… బ్లాక్ ఫంగస్ ముప్పు మనకు ఉంటుందట
ఉల్లిగడ్డలతో బ్లాక్ ఫంగస్ ?
ఉల్లిగడ్డల్లోని పొరలపై ఉండే నల్లని ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ సోకుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది సహజంగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. దీంతో అన్నిరకాల కూరల్లో ఉల్లి వాడకం తప్పనిసరి అయినప్పటికీ ఉల్లిని కొనుగోలు చేయడానికి , వంటల్లో వాడటానికి ప్రజలు భయపడ్డారు. అయితే, ఇందులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Read More: Lock down: గుడ్ న్యూస్ః పక్క రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు
ఉల్లి , కూరగాయాలతో బ్లాక్ ఫంగస్ అనే ప్రచారం…
ఉల్లిపైన ఉండే పొరల్లోని నల్లటి మచ్చల కారణంగా బ్లాక్ ఫంగస్ సోకుతుందని సోషల్ మీడియాలో జరుగతున్నది అంతా తప్పుడు ప్రచారం అని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) క్లారిటీ ఇచ్చింది. ఉల్లి గడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వలన వస్తుందని పేర్కొంటూ అది బ్లాక్ ఫంగస్ కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. సోషల్ మీడియాలో కావాలని కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ ఇలాంటి వాటిని నమ్మొద్దని డాక్టర్ గులేరియా విజ్ఞప్తి చేశారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్ ఫంగస్ రాదని ఆయన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తేల్చి చెప్పారు.