Madhuranagarilo April 26 2024 Episode 348: శ్యామ్ రాధ కి ఫోన్ చేస్తాడు. శ్యామ్ సార్ ఎందుకో ఫోన్ చేస్తున్నాడు అని రాదా ఫోన్ ఎతి మాట్లాడుతుంది. రాధా నీకు ఒక విషయం చెప్పాలి అని శ్యామ్ అంటాడు. ఏంటో చెప్పండి అని రాధా అంటూ ఉండగా వాడితో ఏంటమ్మా మాట్లాడేది రేయ్ అసలు నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉందా ఉంటే మా రాధిక ఎందుకురా ఫోన్ చేస్తున్నావ్ అని మధుర అంటుంది. అమ్మ నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని శ్యామ్ అంటాడు. నువ్వు చెప్పేది ఏమీ లేదు నేను వినేదేమీ లేదు ఇంకోసారి ఫోన్ చేయకు అని మదుర ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా రాదని కాపాడుకోవడం అని టెన్షన్ పడుతూ ఉంటాడు శ్యామ్.
రాదని కాపాడుకోవడం కోసం సూట్ కేసులో ఫోటో మార్చేసింది శ్యామ్ రాధకి ఈ రోజు నైట్ ముహూర్తం పెట్టాను శ్యామ్ ని అక్కడికి వెళ్ళనీయకుండా చేస్తే రాదా పని అయిపోతుంది అని ఆలోచిస్తుంది రుక్మిణి. కట్ చేస్తే, శ్యామ్ రాదని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. రుక్మిణి శ్యామ్ కి మత్తుమందు ఇచ్చి పడుకో పెట్టాలని పాలలో కలుపుతుంది. ఈ పాలు తాగి పడుకో రేపు తెల్లారేసరికి రాధా చావు కబురు ఇందువుగాని రాదని కాపాడుకోవాలని చూస్తావా అని రుక్మిణి అనుకుంటుంది. ఏంటమ్మా రుక్మిణి పాలు తాగుతున్నావా అని దాక్షాయిని అంటుంది.
ఈ పాలు నాకు కాదు శ్యామ్ కి,నువ్వేం చేస్తావో నాకు తెలియదు శ్యామ్ పాలు తాగేలా చెయ్యి అని రుక్మిణి అంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇప్పుడు పాలు తీసుకు వెళ్తే తాగుతాడా అని దాక్షాయని అంటుంది. నేను వెళ్లి ఇస్తే తాగడు నువ్వు ఇస్తే తాగుతాడు అని రుక్మిణి అనడంతో దాక్షాయని పాలు తీసుకుని శ్యామ్ దగ్గరికి వెళుతుంది. ఇలా వచ్చారు అని శ్యామ్ అంటాడు.
శ్యామ్ నువ్వు అన్నం తినలేదు కదా ఈ పాలైన తాగరా అని దాక్షాయని అంటుంది. ఆకలిగా లేనప్పుడు పాలు ఎలా తాగుతారు అత్తయ్య అని శ్యామ్ అంటాడు. నువ్వు పాలు తాగకపోతే నాకు రుక్మిణి అన్నం పెట్టదు రా ఈ పాలు తాగు అని దాక్షాయని అంటుంది. పాలు తాగుతాను కానీ అక్కడ జండుబాముంది ఇచ్చి వెళ్ళు అత్తయ్య అని శ్యామ్ అంటాడు. దాక్షాయని జండుబాం తెచ్చి ఇచ్చేసరికి శ్యామ్ పాలు తాగేస్తాడు. దాక్షాయని వెళ్ళిపోతుంది. శ్యామ్ కి నిద్ర రావడంతో వెళ్లి పడుకుంటాడు. ఈపాటికి కిల్లర్స్ రాదా ఇంటి దగ్గరికి వెళ్లి ఉంటారు ఈ నైట్ రాదా పని అయిపోతుంది అని రుక్మిణి అనుకుంటుంది. కట్ చేస్తే, బిక్షు తన మనసులతో రాధ వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపు బద్దలు కొట్టబోతాడు. ఇంతలో శ్యామ్ అక్కడికి మొహానికి టవల్ కట్టుకొని వచ్చి రాధ జోలికి రాకుండా మిమ్మల్ని తరిమి తరిమి కొడతాను అని అంటాడు.నువ్వుఎవడివిరా అని తన మీదికి వెళ్తాడు. ఎవరైతే నీకెందుకురా రాదా జోలికి ఇక రాము అని ప్రాధేయ్యపడేలా చేస్తాను అని శ్యామ్ వాళ్ళని చితక బాదేస్తాడు.
సార్ తప్పైపోయింది మమ్మల్ని క్షమించి వదిలేయండి అంటూ భిక్షు భిక్షు మనుషులు ప్రాణభయంతో పారిపోతారు. రాధా నేను ఉండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు నిన్ను నేను జీవితకాలం కాపాడుకుంటాను రాదా అని శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, బిక్షు రుక్మిణికి ఫోన్ చేస్తాడు. రాధ ఇంటికి వెళ్లారా తనని లేపేసారా అని అడుగుతుంది. ఏంటి మేడం లేపేసేది ప్రాణ భయంతో పారిపోయి వచ్చాము ఆ ఇంటి అడ్రస్ ఇచ్చారు ముసలోళ్ళు ఉంటారని చెప్పారు కానీ వాళ్ళను కాపాడుతూ ఒక అతను ఉన్నాడని మీరు చెప్పలేదు ఏంటి మేడం అతను ఉండగా ఆ కుటుంబానికి కానీ ఆ అమ్మాయిని కానీ మనం ఏమీ చేయలేము అని భిక్షు అంటాడు. ఆ ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళే ఉంటారు
తనని కాపాడింది ఎవరు అని రుక్మిణి అడుగుతుంది. తను చూడడానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు మేడం ముఖానికి ముసుగు కట్టుకున్నాడు కానీ అతను అ కుటుంబానికి రక్షణ కవచనంలో ఉన్నాడు అతని ఏమైనా చేసిన తరువాత నాకు ఫోన్ చేయండి మేడం ఐదు నిమిషాల్లో ఆ అమ్మాయిని చంపేస్తాను అని భిక్షువు ఫోన్ కట్ చేస్తాడు. బిక్షు చెప్పిన మాటలు వింటుంటే శ్యామ్ పోలికలు ఉన్నాయి ఒకవేళ శ్యామ్ వెళ్లి రాదని కాపాడాడ అని రుక్మిణి శ్యామ్ గదిలోకి వెళ్లి చూస్తుంది. శ్యామ్ ఇక్కడే పడుకొని ఉన్నాడు మరి రాదని కాపాడింది ఎవరు అని ఆలోచిస్తుంది రుక్మిణి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!