అమరావతి, జనవరి 22: విజయవాడనుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో రైలు భ్రేకులు ఒక్క సారిగా పట్టుకు పోవడంతో ఐదవ నెంబరు బోగీలో పొగలు వ్యాపించాయి.
పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. మరమ్మత్తులు చేపట్టిన అనంతరం 25 నిమిషాల తర్వాత రైలు బయలుదేరింది.
next post