మాండూస్ తుఫాను ప్రభావం ఏపిలోని ఆరు జిల్లాల్లో ప్రభావం చూపింది. భారీ వర్షాలుతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అయ్యారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. తుఫాను ప్రభావం నుండి ప్రజలు కోలుకోకముందే వాతావరణ శాఖ నుండి మరో హెచ్చరిక జారీ అయ్యింది. ఈ నెల 13న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం అవిర్బవించనున్నదనీ, దీని ప్రభావంతో 15వ తేదీన అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరో పక్క రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. వీటి ఫలితంగా సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలియజేసింది. కాగా మాండూస్ తుఫాను ప్రభావంతో దాదాపు 36 మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. తుఫాను బాధితులను తక్షణం ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్ధిక సాయం విడుదల చేసింది. పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు చేరుకునే సమయంలో ఒక్కొక్కరికి రూ.వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రెండు వేలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
జగన్ సర్కార్ కీలక ఆదేశాలు .. వారికి ఆర్ధిక సాయం