బాహుబలి ఫ్రాంఛైజీ లాంటి గొప్ప సినిమా తర్వాత రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మీద ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ లు పోరాట యోధులుగా నటిస్తుండగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తోంది. బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తుంది. అలాగే అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకి మళ్ళీ ఈ సినిమాని సెట్స్ మీదకి తెచ్చాడు రాజమౌళి. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నీ బద్రతల మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ ప్రారంభం అయింది.
ముందుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మీద సోలో షాట్స్ ని కంప్లీట్ చేస్తున్నాడు రాజమౌళి. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రకి సంబంధించిన సీన్స్ షూట్ చేసి టీజర్ రెడీ చేయనున్నట్టు సమాచారం. ఎలాంటి అవాంతరాలు లేకపోయినట్టైతే దసరా పండుగ సందర్భంగా ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ వీడియో టీజర్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక ఎప్పటి నుంచో ఈ టీజర్ కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు దేశమంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. కాగా ఆ సమయం ఆసన్నమైందని చిత్ర యూనిట్ అంటున్నారట. ఇక తారక్ ఫ్యాన్స్ సంబరాలకి సిద్దంగా ఉండండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!