మాజీ ఎంపీ హర్షకుమార్ తాజాగా చిరంజీవి ప్రజారాజ్యం పై పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లపై షాకింగ్ కామెంట్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఈ రెండు పార్టీలు పోటీచేసిన సమయంలో సీట్లు రాకపోవడానికి కారణం తనే అన్నట్టుగా హర్షకుమార్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 2009 ఎన్నికలలో ఉపయోగంగా వరి జిల్లాలలో ప్రజారాజ్యం పార్టీ ఓటమికి కారణం తనే అని, 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో తన వర్గం లో ఉన్న చాలా మందిని జనసేన పార్టీలోకి పంపించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసని కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ తనని ఆహ్వానిస్తారని భావించానని కానీ ఆయన నుండి పిలుపు రాలేదని చెప్పుకొచ్చారు. కారణం చూస్తే రెండుసార్లు ఎంపీ గా గెలవడంతో తనకు పరపతి ఎక్కువగా ఉండటంతో పవన్ ఇన్ సెక్యూరిటీ ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. అందువల్లే తనని పార్టీలో చేర్చుకోలేదని హర్ష కుమార్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా త్వరలో తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లి పోతున్నట్లు రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమైనట్లు హర్షకుమార్ క్లారిటీ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో టిడిపి పార్టీ నుండి పోటీ చేయాలని భావించి చివరి నిమిషాల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో, ఆ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక హర్షకుమార్ వైసీపీ ప్రభుత్వం పై దళితులపై దాడుల విషయంలో పోరాడుతూ వస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువైనట్లు మీడియా ముందు తెగ విమర్శిస్తు వార్తల్లో నిలుస్తున్నారు.