Rajamouli : పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి రీసెంట్గా RRRతో సహజంగానే మరో హిట్టుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దాంతో ఫెయిల్యూర్ అంటే ఏమిటో ఎరగని దర్శకుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే రాజమౌళి మరింత ఉత్సాహాంగా మహేష్ బాబుతో సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ రాజమౌళి వీరి కాంబినేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకొచ్చాడు.
Rajamouli : ఇదే అసలు కథ
మహేష్ కోసం తన వద్ద 2 కథలున్నాయని చెప్పుకొచ్చాడు రాజమౌళి. కరోనా కారణంగా RRR రిలీజ్ వాయిదా పడ్డప్పుడు ఇంట్లో ఖాళీగా వున్నపుడు ఊసుపోకుండా మహేష్ సినిమాపై పని చేశారట. అప్పుడే మహేష్ కోసం 2 కథల్నీ రెడీ చేశామని.. అన్నారు. ఆ రెండింటిలో మహేష్కు ఏది నచ్చితే అది సినిమా కథతో సినిమా ఉంటుందని జక్కన్న అన్నారు. ఇక ఈ సినిమా 2022 చివర్లో షూటింగ్కు వెళ్లవచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా 800 కోట్లతో భారీగా రూపొందించనున్నారట.
Rajamouli : OTT సంగతి:
మరోవైపు రాజమౌళి OTT కోసం సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. OTT ప్రభావం అర్ధం చేసుకున్న రాజమౌళి, OTT చిత్రం చేయడానికి కూడా రెడీ అవుతున్నాడట. కంటెంట్ని మరింతమంది ప్రజలు చూడాలి అంటే అది ఓటీటీ లేదా వెబ్ సిరీస్ ద్వారానే సాధ్యం అని అన్నారు. ఈ సందర్భంగా సౌత్ సినిమాలు ప్రాంతీయ సినిమాలు కావు. RRR అనేక పాశ్చాత్య దేశాలలో కూడా బాగా రాణిస్తోంది. క్రియేటివిటీకి ఎల్లలు హద్దులు ఉండవని ఇది నిరూపించింది అని రాజమౌళి అన్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!