ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న ఎన్.టి.ఆర్ వరసగా సినిమాలని లైన్ లో పెట్టాడు. కాని చరణ్ మాత్రం ఈ సినిమా తర్వాత ఎవరెవరితో సినిమా చేయబోతున్నాడన్నది గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారింది.
అయితే చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వెంకీ కుడుములతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఛలో, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. మూడవ సినిమా చరణ్ తో చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ హీరోయిన్ గా రష్మిక తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇప్పటికే చరణ్ వెంకీ కుడుముల మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. వెంకీ చెప్పిన కథ చరణ్ కి విపరీతంగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందబోతుందట.
అయితే ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమా తర్వాత చరణ్ ఈ సినిమా చేయడం కొంతమందికి షాకింగ్ గా అనిపిస్తుందట. పాన్ ఇండియన్ స్టార్ గా ఆర్ ఆర్ ఆర్ తో క్రేజ్ సాధించడం ఖాయం. అయినా తన నెక్స్ట్ సినిమాకి ఇలాంటి కథ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అని అందరూ చర్చించుకుంటున్నారట. చూడాలి మరి అధికారకంగా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్నది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!