టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ జులై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో అలరించనున్నాడు. అయితే తాజాగా రవితేజ గురించి ఒక ప్రచారం సినీ సర్కిల్లో ఫ్యాన్స్ ని బాగా బాధకు గురి చేస్తోంది. ఆ ప్రచారం ప్రకారం రవితేజ కెరీర్ తొలినాళ్లలో ఎలా వున్నాడో ఇప్పుడు అలా లేడు. అంటే అతని గ్లామర్, ఫిజిక్ విషయంలో కాదు. కెరీర్ పరంగా మారిపోయాడు. రవితేజ సినిమాలు ఒకప్పుడు సూపర్ హిట్స్ అయేవి. కానీ గత కొన్ని ఏళ్లుగా వరుస ఫ్లాప్స్తో అతని గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. క్రాక్ సినిమాతో ఒక మాదిరి విజయం సాధించాడు. ఆ తరువాత వచ్చిన ఖిలాడి సినిమా మళ్లీ రవితేజకి పరాజయాన్ని రుచి చూపించింది.
రవితేజ అలా మారిపోయాడా
ఖిలాడి సినిమా సమయంలో రవితేజ నిర్మాతలను చాలా ఇబంది పెట్టేసాడని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి ఒక రేటు, ప్రమోషన్స్ కి రావాలంటే మరో రేటు అడిగినట్లు సినీ వర్గాల్లో వినబడింది. దాంతో అప్పట్లో ఇదేం తీరు అని ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ మూవీ విషయంలోనూ అదే తీరు రవితేజ అనుసరిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఇలా అయితే కెరీర్ ముగిసినట్టే!
రామారావు ఆన్ డ్యూటీ మూవీని శరత్ మండవ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అవుతుండగా జులై 16 అంటే రేపు సాయంత్రం రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. విడుదలకు ఇంకో రెండు వారాల సమయం మాత్రమే ఉంది కాబట్టి డైరెక్టర్తో పాటు హీరోయిన్, ఇతర నటీనటులందరూ కూడా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు. కానీ రవితేజ మాత్రం ఏ ఇంటర్వ్యూలలో కనబడట్లేదు. ఏ ప్రమోషన్ ఈవెంట్ లో ఆయన కనిపించిన పాపాన పోవడం లేదు. దీంతో సినిమా నిర్మాత తల పట్టుకుంటున్నాడు. రవితేజతో సినిమా తీయాలంటే హీరోగా ఒక రేటు, డబ్బింగ్కి ఇంకో రేటు, ప్రమోషన్స్ కి మరో రేటు ఫిక్స్ చేయాలా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సపరేటుగా డబ్బులు ఇవ్వకపోతే రవితేజ నిర్మాతలని ఇబ్బంది పెట్టడానికి ఏ మాత్రం వెనకడారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రచారాలు జరిగితే అతని కెరీర్ లైఫ్ బాగా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే అతను సినీ ఇండస్ట్రీ నుంచి తట్టాబుట్టా సర్దుకొని పోవాల్సిందేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!