ఎనర్జిటిక్ హీరో రామ్ కు మాళవిక శర్మ, అమృత అయ్యర్ జంటగా…. నివేత పేతురాజ్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రెడ్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మించారు. తమిళ బ్లాక్బస్టర్ సినిమా ‘తడాం’ రీమేక్ గా తెరకెక్కిన రెడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆశతో ఉన్నారు. పైగా సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు కూడా లేకపోవడం దీనికి కలిసొచ్చే అంశం.
మొదటి అర్ధ భాగం చాలా స్లో గా కొనసాగుతుంది. క్యారెక్టర్లను పరిచయం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు ఇంటర్వెల్ లో ఆకాశ్ అనే వ్యక్తి యొక్క హత్య జరిగినట్లు చూపిస్తాడు. ఈ హత్యకు ఒక సెల్ఫీ అధారంగా సిద్ధార్థ్ (రామ్) ను అరెస్ట్ చేస్తారు. అయితే ఆదిత్య (మరో రామ్) కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి అదే పోలీస్ స్టేషన్ కు వస్తాడు. వీరిద్దరూ ఒకే లాగా ఉండడంతో పోలీసులు కన్ఫ్యూజ్ అవుతారు. ఇద్దరిలో హత్య చేసింది ఎవరు అన్న దానిమీద రెండవ భాగం మొదలవుతుంది.
సెకండ్ హాఫ్ – లైవ్ అప్డేట్స్
- రెండవ అర్ధ భాగం మొదట్లో పోలీస్ ఆఫీసర్ సంపత్ కు ఈ మిస్టరీ కేసు సాల్వ్ చేసేందుకు రెండు రోజుల సమయం ఉంటుంది. పోసాని కృష్ణమురళి అతని ఫ్రెండ్ గా, ప్రాసిక్యూటర్ గా వ్యవహరిస్తాడు.
- పోలీసులు చనిపోయిన ఆకాశ్ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే అతని చావుకు గల కారణాలను విశ్లేషిస్తుంటారు. మధ్యలో కామెడీ ట్రాక్ బాగుంది.
- సిద్ధార్థ (రామ్) మాత్రం తనకు, పోలీస్ ఆఫీసర్ సంపత్ కు మధ్య ఉన్న గొడవలు కారణంగానే…. ఆ కక్ష్యతోనే ఈ మర్డర్ కేసులో ఇరికిస్తున్నాడు అని ఆరోపిస్తాడు. పైగా రౌడీ లాగా ఉండే ఆదిత్య (మరో రామ్) పైనే అందరి దృష్టి నెలకొంటుంది.
- నివేత, కిషోర్ మధ్య జరిగే కామెడీ సీన్లు పెద్దగా పేలలేదు. సిద్ధార్థ జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే సిద్ధార్థ, ఆదిత్య మధ్య పోలీస్ స్టేషన్ లో ఫైట్ ఉంటుంది.
- సిద్ధార్థ, అదిత్య వారి తల్లిదండ్రుల గురించి, తమ గతం గురించి పోలీసులకు చెబుతారు. వారి తల్లిదండ్రులు ఎలా విడాకులు తీసుకున్నారు…. తర్వాత జరిగిన పరిణామాలు తమ జీవితాలను ఎలా మార్చేశాయి అన్న విషయాన్ని చెబుతారు.
- సిద్ధార్థ తండ్రి తో పాటు ఉండి జీవితంలో బాగా ఎదిగితే… ఆదిత్య తల్లితో ఉంటాడు. ఆమె జూదానికి అలవాటుపడగా చివరికి వాళ్ళ అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. సిద్ధార్థ ఇంజనీరింగ్ చదువుతాడు. ఆదిత్య ‘లా’ చదువుతాడు. జీవితంలో బాగా ఎదిగిన సిద్ధార్థ ను చూసి ఆదిత్య ఈర్ష్య తో రగిలిపోతుంటాడు అని చెప్తారు.
- ఆదిత్య తనమీద ఉన్న ఈర్ష్య వల్లనే ఈ కేసు తన పైన వేస్తున్నాడు అని సిద్ధార్థ కోర్టులో చెబుతాడు. పోలీస్ ఆఫీసర్ సంపత్ కూడా సిద్ధార్థను కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తాడు. అయితే ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కోర్టు ఇద్దరినీ విడిచి పెడుతుంది.
- పోలీస్ ఇంటరాగేషన్ ముగిసిన తర్వాత సినిమా కొద్దిగా ఫాస్ట్ గా అవుతుంది. మొత్తానికి సినిమా ఎండింగ్ లో భారీ ట్విస్టు అనేది చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత సినిమాకి ఎండ్ కార్డు పడిపోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!