(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారధి నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసి) గా బాధ్యతలు నిర్వహించిన నాగిరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రిటైర్ అయ్యారు.
1993 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన పార్థసారధి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయ్యారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఏస్ఈసీగా పార్థసారధి నియామక ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. పార్ధసారధి ఈ పదివిలో అయిదేళ్లు కొనసాగుతారు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ఏస్ఈసీ పదవికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వారు లేదా పదవీ విరమణ పొందిన అధికారులను కమిషనర్గా నియమించాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని అనుసరించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్ధసారధిని ఎస్ఈసీగా కెసిఆర్ సర్కార్ నియమించింది.