నాసా తెలుపుతున్న విషయాలు రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే తాజాగా చందమామపై నీటిని కనుగొన్నట్లు నాసా తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.. కాగా చందమామపైకి మళ్లీ వ్యోమగాముల్ని పంపాలనుకుంటున్న వారికి ఈ నీటి వార్త ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా స్పష్టం చేసింది. దీనితో పాటుగా భూమికి అతి దగ్గరలో ఉన్న గ్రహశకలం గురించి కూడా అందరికీ తెలిపింది.
ఈ గ్రహశకలం ద్వారా భూమి అంతరించి పోయే ప్రమాదం ఉందని హెచ్చిరింది. మరీ ముఖ్యంగా ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టడం మూలంగా యుగాంతం జరుగుతుందని నాసా తన పరిశోధనలో స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో కొత్త విషయంతో నాసా అందరికీ ఆసక్తి కలిగించే విషయాలను పట్టుకొచ్చింది. అందేటంటే.. అంగారక గ్రహం నుంచి రాతి నమూనాలను భూమిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలను మొదలు పెట్టనుంది.
అయితే దీనికి మార్స్ శాంపిల్ రిటర్న్ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఈ నమూనాల ద్వారా శాస్త్ర ఙ్లులు అరుణ గ్రహం పై జీవ రాశులు ఉండేవా.. లేవా అనే విషయం పై పరిశోధనలు జరపనున్నారు. అయితే ఈ విషయమై నాసా తన ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
కాగా దీనికి ఎం ఎస్ ఆర్ ఇండిపెండెంట్ రివ్యూ అనే బోర్డు పేరిట సంస్థను కూడా ఏర్పటు చేసింది.
ఇదిలా ఉంటే ఇలా మరో గ్రహం నుంచి రాతి నమూనాలను భూమి పైకి తెచ్చే ఈ వినూత్న ప్రయత్నం మాత్రం మొదటిదే నని సానా తెలిపింది. దీనితో పాటుగా అంగారక గ్రహానికి సంబంధించి కూడా రీసెర్చ్ ను మరింత ముమ్మరం చేస్తున్నది నాసా. కాగా చంద్రునిపై 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ సేవలు ప్రారంభించేందుకు నాసా ఒక ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిపింది . అయతే దీనిలో భాగంగా నోకియా రీసెర్చ్ విభాగమైన బెల్ ల్యాబ్స్ తో కూడింది సానా. చూడాలి మరి ఇంకెన్ని కొత్త విషయాలను ఏం చెబుతోందో..