RULES : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పుల వల్ల మీ రోజువారీ జీవితంపై ప్రభావం పడవచ్చు. పాజిటివిటీ పే సిస్టం, గ్యాస్ ధర, పాన్-ఆధార్ లింక్ వంటి అనేక మార్పులు సెప్టెంబర్ నెలలో రాబోతున్నాయి. అవేంటో, వాటి వల్ల మీ కార్యకలాపాలపై పడే ప్రభావం ఏంటో వివరంగా తెలుసుకుందాం.
1.ఆధార్-పీఎఫ్ అనుసంధానం:
ఆగస్టు 31వ తేదీతో పీఎఫ్ అకౌంట్కు ఆధార్ లింకు చేసుకునే గడువు ముగుస్తుంది. దాంతో సెప్టెంబర్ 1 నుంచి ఆధార్ లింక్ చేసిన పీఎఫ్ అకౌంట్లలో మాత్రమే నగదు జమ అవుతుంది. ఆధార్ తో పీఎఫ్ అకౌంట్ అనుసంధానం చేయకపోతే మీ వాటాతో పాటు.. మీ కంపెనీల వాటా కూడా పీఎఫ్ అకౌంట్లలో జమ కాదు. ఈ విషయం మీరు గమనించాలి.
Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..!!
2. చెక్ క్లియరింగ్ పాజిటివిటీ పే సిస్టం:
ఆర్బీఐ ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి తెచ్చిన ‘పాజిటివిటీ పే సిస్టం’ను అమలు చేయడానికి యాక్సిస్ బ్యాంకు ముందుకు వచ్చింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ వ్యవస్థను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ సరికొత్త సిస్టం ప్రకారం 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చెక్కులను జారీ చేసేముందు కస్టమర్లు తమ బ్యాంకులకు తెలియజేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే చెక్ బౌన్స్ అవుతుంది.
COOL DRINKS: కూల్ డ్రింక్ తాగితే ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా.?
3. జీఎస్టీఆర్-1 ఫైలింగ్:
సెప్టెంబర్ నుంచి జీఎస్టీఆర్ ఫైలింగ్లో కేంద్ర జీఎస్టీ నియమాల్లోని రూల్-59(6) ప్రకారం కొత్త మార్పులు రానున్నాయి. ఈ కొత్త నియమాల ప్రకారం గత ట్యాక్స్ పీరియడ్లో ఫారం జీఎస్టీఆర్-3బీలో రిటర్న్ దాఖలు చేయకపోతే.. వారు జీఎస్టీఆర్-1ని ఫైల్ చేయడానికి సాధ్యపడదు. అంతేకాకుండా, త్రైమాసిక రిటర్న్స్ను సైతం దాఖలు చేయడానికి అనుమతి ఉండదు.
White Hair: తెల్లజుట్టు ఉందని కంగారు పడకండి.. ఇదొక్కటి తలకి రాసుకుని చూడండి.. మ్యాజిక్ కనిపిస్తుంది..!!
4. ఎస్బీఐ అకౌంట్స్ పాన్-ఆధార్ లింకు:
తమ కస్టమర్లు ఆధార్-పాన్ కార్డులను సెప్టెంబరు 30 నాటికి లింక్ చేయాల్సిందిగా ఎస్బీఐ ప్రకటించింది. అలా చేయని యెడల ఐడెంటిఫికేషన్ కార్డు రద్దు అవటంతో పాటు దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు రద్దవుతాయని వెల్లడించింది. ఒకే రోజులో రూ.50 వేలకు పైగా డిపాజిట్ చేయాలంటే కస్టమర్లు కచ్చితంగా ఆధార్-పాన్ లింక్ చేయాల్సిందే!
BREAKING : 50వేల మందికి రాత్రికి రాత్రి గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్!
5. గ్యాస్ ధర:
గడిచిన రెండు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్పై భారీగా ధరలు పెంచారు. ఒక్కో వంటగ్యాస్ సిలిండర్పై జులైలో రూ.25.50.. ఆగస్టులో రూ.25 పెంచారు. సెప్టెంబర్ నెలలో కూడా గ్యాస్ ధరలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.165 రూపాయలు పెరిగింది.