NewsOrbit
న్యూస్

RULES : సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త మార్పులు రాబోతున్నాయి..!

RULES : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పుల వల్ల మీ రోజువారీ జీవితంపై ప్రభావం పడవచ్చు. పాజిటివిటీ పే సిస్టం, గ్యాస్‌ ధర, పాన్‌-ఆధార్‌ లింక్ వంటి అనేక మార్పులు సెప్టెంబర్ నెలలో రాబోతున్నాయి. అవేంటో, వాటి వల్ల మీ కార్యకలాపాలపై పడే ప్రభావం ఏంటో వివరంగా తెలుసుకుందాం.

1.ఆధార్‌-పీఎఫ్‌ అనుసంధానం:

ఆగస్టు 31వ తేదీతో పీఎఫ్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింకు చేసుకునే గడువు ముగుస్తుంది. దాంతో సెప్టెంబర్ 1 నుంచి ఆధార్‌ లింక్ చేసిన పీఎఫ్‌ అకౌంట్‌లలో మాత్రమే నగదు జమ అవుతుంది. ఆధార్ తో పీఎఫ్‌ అకౌంట్ అనుసంధానం చేయకపోతే మీ వాటాతో పాటు.. మీ కంపెనీల వాటా కూడా పీఎఫ్‌ అకౌంట్‌లలో జమ కాదు. ఈ విషయం మీరు గమనించాలి.
Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..!!

2. చెక్‌ క్లియరింగ్‌ పాజిటివిటీ పే సిస్టం:

ఆర్‌బీఐ ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి తెచ్చిన ‘పాజిటివిటీ పే సిస్టం’ను అమలు చేయడానికి యాక్సిస్‌ బ్యాంకు ముందుకు వచ్చింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ వ్యవస్థను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ సరికొత్త సిస్టం ప్రకారం 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చెక్కులను జారీ చేసేముందు కస్టమర్లు తమ బ్యాంకులకు తెలియజేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే చెక్ బౌన్స్ అవుతుంది.

COOL DRINKS: కూల్ డ్రింక్ తాగితే ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా.?
3. జీఎస్టీఆర్‌-1 ఫైలింగ్‌:


సెప్టెంబర్ నుంచి జీఎస్టీఆర్‌ ఫైలింగ్‌లో కేంద్ర జీఎస్టీ నియమాల్లోని రూల్‌-59(6) ప్రకారం కొత్త మార్పులు రానున్నాయి. ఈ కొత్త నియమాల ప్రకారం గత ట్యాక్స్ పీరియడ్‌లో ఫారం జీఎస్టీఆర్‌-3బీలో రిటర్న్‌ దాఖలు చేయకపోతే.. వారు జీఎస్టీఆర్‌-1ని ఫైల్‌ చేయడానికి సాధ్యపడదు. అంతేకాకుండా, త్రైమాసిక రిటర్న్స్‌ను సైతం దాఖలు చేయడానికి అనుమతి ఉండదు.
White Hair: తెల్లజుట్టు ఉందని కంగారు పడకండి.. ఇదొక్కటి తలకి రాసుకుని చూడండి.. మ్యాజిక్ కనిపిస్తుంది..!!

4. ఎస్‌బీఐ అకౌంట్స్ పాన్‌-ఆధార్‌ లింకు:

తమ కస్టమర్లు ఆధార్‌-పాన్ కార్డులను సెప్టెంబరు 30 నాటికి లింక్ చేయాల్సిందిగా ఎస్‌బీఐ ప్రకటించింది. అలా చేయని యెడల ఐడెంటిఫికేషన్‌ కార్డు రద్దు అవటంతో పాటు దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు రద్దవుతాయని వెల్లడించింది. ఒకే రోజులో రూ.50 వేలకు పైగా డిపాజిట్‌ చేయాలంటే కస్టమర్లు కచ్చితంగా ఆధార్‌-పాన్‌ లింక్ చేయాల్సిందే!

BREAKING : 50వేల మందికి రాత్రికి రాత్రి గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్!

5. గ్యాస్‌ ధర:

గడిచిన రెండు నెలల్లో వంటగ్యాస్‌ సిలిండర్‌పై భారీగా ధరలు పెంచారు. ఒక్కో వంటగ్యాస్‌ సిలిండర్‌పై జులైలో రూ.25.50.. ఆగస్టులో రూ.25 పెంచారు. సెప్టెంబర్ నెలలో కూడా గ్యాస్ ధరలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.165 రూపాయలు పెరిగింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N