BREAKING:50 వేల మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ రాత్రికి రాత్రే తీపి కబురు అందించింది. ఇప్పటికే ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కారు తాజాగా వారి సంక్షేమం కోసం బీమా విషయంలో మరొక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల బీమా కోసం ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం సంభవించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికంగా ఆదుకుంటుంది. ఈ ప్యాకేజీని భారీ పరిహారంతో ప్రవేశపెట్టారు. ఒకవేళ ఉద్యోగులు మరణిస్తే.. వారి పిల్లల ఎడ్యుకేషన్ లోన్స్, ఆడపిల్లల వివాహ రుణాలను మాఫీ చేయనున్నారు.
Teenmar Mallanna arrest: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసు..! ఆ కేసులో నంట..?
ప్రస్తుతానికైతే.. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మాత్రమే ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ని అందిస్తున్నారు. ఇకపై ఈ తరహా ప్యాకేజీ కింద ఆర్టీసీ ఉద్యోగులు సైతం లబ్ధి పొందనున్నారు. అయితే జగన్ సర్కార్ ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఈ బ్యాంకులోనే ఉద్యోగులు శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్నారు. ఐతే ఈ ప్యాకేజీతో ఏపీలో మొత్తం 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
SUSCIDE: పెళ్లిలో కన్యాదానం చేసిన తరువాత వధువు తల్లి తండ్రులు ఆత్మహత్య..!