sai dharam tej : సాయి ధరం తేజ్ వరసగా సూపర్ హిట్స్ అందుకుంటూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. చిత్రల హరి, ప్రతి రోజూపండుగే సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సాయి ధరం తేజ్ రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తో మూడు వరస సక్సస్ లని అందుకున్న సాయి ధరం తేజ్ మరో విభిన్నమైన కథ తో రాబోతున్నాడు. ఈ సినిమాకి ప్రస్థానం ఫేం దేవాకట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా ఇప్పటికే సగానికిపైగా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ విషయంలో రక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఆ వార్తలకి అన్నిటికి చెక్ పెడుతూ చిత్ర బృందం ఈ సినిమాకి రిపబ్లిక్ అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ‘SD14’ టైటిల్ ని రిపబ్లిక్ అన్న టైటిల్ ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.
sai dharam tej : సాయి ధరం తేజ్ వాయిస్ లోనే కథ చెప్పారా ..?
ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులను ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్” అంటూ సాయి తేజ్ చెప్పే వాయిస్ ఓవర్ తో మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మెగా ఫ్యాన్స్ ని ఈ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు – రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!