శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎం01ఎస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో 6.2 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా.. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ను కలిగి ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్ను ఇందులో ఇచ్చారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. స్టోరేజ్ 32 జీబీగా ఉంది. అవసరం అనుకుంటే మెమొరీని కార్డు సహాయంతో 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 3జీబీ ర్యామ్ను ఇందులో ఇచ్చారు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 ఆధారంగా పనిచేస్తుంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 2 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుకవైపు ఉంటుంది. సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ ఫీచర్ ఇచ్చారు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. రెండూ 4జీకి సపోర్ట్నిస్తాయి.
ఈ ఫోన్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. రూ.9,999 ధరకు దీన్ని కొనవచ్చు.