Sekhar Master: మన రెండు తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే శేఖర్ మాస్టర్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఓ రంజిలో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలలో డాన్స్ మాస్టర్ గా చేస్తూనే మరోవైపు బుల్లితెర మీద రియాలిటీ షోస్ లో హోస్ట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య శేఖర్ మాస్టర్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కామెడీ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జీ తెలుగు ‘అదిరింది’ షో నుంచి బయటకు వచ్చిన కమెడియన్స్ ఈ షో లో ప్రత్యక్షమయ్యారు.
జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ తో పోటీ పడలేక వేరే ఛానళ్ళు ఇటువంటి కామెడీ షో లు ప్రారంభినప్పటికీ అవి సక్సెస్ అవ్వడం లేదు. దీనితో ఇంక ఆ షో నిర్వాహకులు నిలిపివేస్తున్నారు. ఇటువంటి సమయంలో వారు వర్షిణి మీద ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వర్షిణి కమెడియన్ హైపర్ ఆదితో కలిసి ఢీ షోలో హోస్ట్ గా చేసి ప్రేక్షకుల మన్నన్నలు పొందింది. ఇప్పుడు ఆమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది..
ఇదిలా ఉండగా అసలు వర్షిణి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక శేఖర్ మాస్టర్ ప్రమేయం ఉన్నట్లు సమాచారం. వర్షిణి మరియు హైపర్ ఆది తో మల్లెమాల వారు ప్రోగ్రాం ను అనుకుంటున్న సమయంలో వర్షిణి స్టార్ మా కు వెళ్లిపోయింది. ఇక దీనితో హైపర్ ఆది అసహనానికి గురయ్యి శేఖర్ మాస్టర్ మీద కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వర్షిణి మాత్రం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడంలేదట.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!