Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపటి నుండి ఈ నెల 10వ తేదీ వరకూ పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఏ 4 గా ఉన్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్స్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుండి రూ.50 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందనరావు , ఆయన బంధువుల నుండి కోటి సీజ్ చేశామని అంగీకరించారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
తాజాగా రాధాకిషన్ రావును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వడంతో ఈ ఏడు రోజుల విచారణలో ఎటువంటి వివరాలు వెల్లడిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
YSRCP: ఆ నియోజకవర్గంలో టీడీపీకి షాక్ ..జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత