YSRCP: వైఎస్ జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గంగాధర నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత వైసీపీలో జాయిన్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కూతూహలమ్మ కుమారుడు హరికృష్ణ వైసీపీలో చేరారు.
సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. హరికృష్ణ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి నారాయణ స్వామి చేతుల్లో ఓటమి పాలైయ్యారు. హరికృష్ణ పై నారాయణ స్వామి దాదాపు 45వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. ఈ సారి ఎన్నికల్లోనూ హరికృష్ణ టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. కానీ చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
డాక్టర్ వీఎం థామస్ కు టీడీపీ అభ్యర్ధిత్వం ఖరారు అయ్యింది. దీంతో హరికృష్ణ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి పాల్గొన్నారు.
Pawan Kalyan: పవన్ తెనాలి పర్యటన వాయిదా .. ఎందుకంటే ..?