Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. గత నాలుగు రోజులుగా తను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ అస్వస్థతకు గురైయ్యారు.
ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఈ రోజు తెనాలి లో చేపట్టాల్సిన వారాహి విజయభేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేసినట్లు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ తెలిపారు.
కనీసం రెండు మూడు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారని హరిప్రసాద్ పేర్కొన్నారు. రీషెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తామని తెలిపారు. రీషెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా, నాలుగు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా అస్వస్థతకు గురైయ్యారు. అలాగే పవన్ నిన్నటి వరకూ పర్యటించారు.
పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని హరిప్రసాద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. పవన్ జ్వరం నుండి త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన నేతలు ఆకాంక్షిస్తున్నారు.
YSRCP: డబుల్ సెంచరీ కొట్టడమే వైసీపీ లక్ష్యమన్న సీఎం జగన్