Tollywood singer: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ ‘హరిణి’ గురించి అందరికీ తెలిసిందే. తన గాత్ర మాధర్యంతో ఎంతో మంది శ్రోతలను అలరించింది. అయితే, అనుకోకుండా ఆమె కుటుంబంలో ఒక కుదుపు. ఫ్యామిలీ మొత్తం కనిపించకుండా పోయారు. ఇటీవలే హరిణి కుటుంబం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే సింగర్ హరిణి తండ్రి రైలు పట్టాలపై శవమై కనిపించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారడంతో మిగతా కుటుంబ సభ్యులు ఎక్కడపోయారో అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరిణి ఫ్యామిలీ కిడ్నాప్..?
హరిణి కుటుంబం (Singer Harini Family)లో మిగతా సభ్యులు ఎక్కడకు పోయారని అంతా టెన్షన్ పడుతున్నారు. ఎవరైనా డబ్బుల కోసం కిడ్నాప్ చేశారా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. వారి బంధువులు ట్రై చేస్తుండగా అందరి సెల్ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో హరిణి ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు రైల్వే ట్రాక్ పై హరిణి ఫాదర్ ఏకే రావు మృతదేహం కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మృతదేహాన్ని పరిశీలించగా 2 రోజుల కిందటే ఆయన మరణించినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు.
హరిణి తండ్రిది ఆత్మహత్యా లేక హత్యా..?
ఏకే రావు(AK Rao) తొలుత ఆత్మహత్య (Suicide) చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. కానీ, క్షుణ్ణంగా పరిక్షించగా ఆయన బాడీపై గాయాలు కనిపించాయి. దీంతో ఆయనది ఆత్మహత్య కాదని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏకే రావు ప్రస్తుతం సుజనా ఫౌండేషన్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఆయన్ను హత్య చేసి ఉంటే ఆయన్ను ఎవరు చంపి ఉంటారు. ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆర్థిక లావాదేవీలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కనిపించకుండా పోయిన వారికోసం కూడా గాలిస్తున్నారు. కాగా, హరిణి ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయనిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో మొత్తం 3500 పాటలు పాడారు హరిణి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!