ఇరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఆకస్మిక బదిలీ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు చీఫ్ జస్టిస్ లు మహేశ్వరి, రాఘవేంద్ర చౌహన్ లను బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటన పెట్టుకున్న తర్వాత ఆకస్మికంగా ఈ బదిలీలు జరగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
** ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి సిక్కిం హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళానున్నారు.
** ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి.? రానున్నారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న గోస్వామి కొనసాగుతున్నారు.
** తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న రాఘవేంద్ర చౌహన్ స్థానంలో హీమా కోహ్లీ నియామకం అవునున్నట్లు తెలుస్తోంది.
** తెలంగాణ హైకోను సిజే ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది.
**ఢిల్లీ హైకోర్టు నాయమూర్తిగా ఉన్న హీమా కోహ్లీకి పదోన్నతి మీద తెలంగాణ కు తీసుకురానున్నారు.
సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు, రెండ్రోజుల్లో రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఎం జరిగింది??
హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటివరకు అరవై ఎనిమిది సార్లు మొట్టికాయలు పడ్డాయి. ప్రతి విషయం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కోర్టు దాన్ని స్వీకరించి విచారణ తీసుకోవడం… ఏదో ఒక కారణంతో దానిపై అభ్యంతరాలు చెప్పడం మీదే సరిపోతుంది. చాలా అంశాల్లో జగన్ అనుకున్నట్లుగా సాగలేదు. రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో పలురకాల పిటిషన్ వేయడం వాటిని హైకోర్టు సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద వ్యాఖ్యలు చేయడం సాధారణం అయిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకమైన స్థానంలో ఉన్న మహేశ్వరి అనేక కేసుల్లోనూ ప్రభుత్వ వాదన మీద ఏకీభవించలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ ఢిల్లీ టూర్ కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అందులోనూ సుప్రీం కొలీజియం అప్పుడప్పుడు సమావేశమై కనీసం రెండేళ్లు కూడా పనిచేయని ఇద్దరూ బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.