జగన్ జగమొండి. కానీ కోర్టులు మరింత మొండి కదా..! జగన్ లాంటి వాళ్ళని ఎంతో మందిని వంచే ఉంటాయి కదా…! పాపం అందుకే జగన్ కోర్టుల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. జగన్ వినను అన్నా…, వినేట్టు చేయడం కోర్టుల ప్రత్యేకత. అందుకే నిమ్మగడ్డ కేసులో మరోసాటి సుప్రీం కోర్టు వైసీపీ ప్రభుత్వాన్ని కడిగేసింది. “గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వచ్చే శుక్రవారం లోగా అమలు చేయాలంటూ కచ్చితంగా చెప్పింది. “గవర్నర్ లేఖ పంపినా పోస్టింగ్ ఇవ్వరా..? ఈ కేసులో మొదటి నుండి మాకు విషయాలన్నీ తెలుసు. ఏపీలో అసలు ఏం జరుగుతుంది..? అంటూ ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించినట్టు సమాచారం.
నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. పాపం.., ప్రభుత్వం ఒకటి తలిస్తే కోర్టుల ఆలోచన, కోర్టుల వాదన మరోలా ఉంటుంది. నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వం అనుకున్నవి ఏవీ జరగడం లేదు. కోర్టు వద్ద .., నిమ్మగడ్డ తరపు న్యాయవాదుల వద్ద బలమైన పాయింట్లు ఉండడంతో జగన్ ప్రభుత్వానికి వరుసగా తలనొప్పులు తప్పడం లేదు. అందుకే తాజాగా ఈరోజు కూడా సుప్రీం ఇచ్చిన ఆదేశాల్లో ప్రభుత్వాన్ని కడిగేసింది. “ఈ కేసులో మొత్తం మాకు తెలుసు. అందుకే స్టే ఇవ్వము, గవర్నర్ పంపిన లేఖపై వారం లోగా ఏదో ఒకటి తేల్చండి.” అంటూ చిన్నపాటి మొట్టికాయలు వేసింది.