సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు ఇవాళ మరో మలుపు తిరిగింది. సుశాంత్ మరణించన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు దాన్న ఆత్మహత్య అంటే.. మరికొందరు హత్య అన్నారు. ఇంకొందరైతే డాగ్ బెల్ట్ తో సుశాంత్ గొంతు నులిమి హత్య చేశారు అని ఆరోపించారు. ఇలా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతున్నా.. అసలు నిజం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.
అందుకే… ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి సుశాంత్ మరణించినప్పటి నుంచి బీహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయి. కేసు మాదంటే మాదంటూ వాదులాడుకున్నారు ఇరు రాష్ట్రాల పోలీసులు.
మరోవైపు ఈ కేసును పాట్నా పోలీసుల చేతుల్లో నుంచి ముంబై పోలీసులకు అప్పగించాలంటూ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసును విచారిస్తూనే సుప్రీం… సీబీఐకి అప్పగించాలంటూ తెలిపింది.
ఇక.. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో అసలు నేరస్తులు ఎవరో త్వరలోనే తేలిపోనున్నదని సుశాంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. సీబీఐకి ఈ కేసును అప్పగించాలని సుప్రీం ఆదేశించిన రెండు గంటల్లోనే రియా చక్రవర్తి, తన లాయర్లు కలిసి సాక్ష్యాలను తారుమారు చేశారని సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
సాక్ష్యాలు తారుమారు చేసి ఈనేరాన్ని ఎవరిమీద నెట్టబోతున్నారోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తీర్పు వెలువడిన 2 గంటల్లోనే రియా ఇలా సాక్ష్యాలను తారుమారు చేయడం దేనికి నిదర్శనమని వాళ్లు వాపోతున్నారు.
అయితే… కేసు సీబీఐకి అప్పగించడంతో.. సీబీఐ ముందుగా రియానే ప్రశ్నించనుంది. ఈడీ అధికారులు కూడా రియాను, తన కుటుంబ సభ్యులను సుశాంత్ మరణంపై ప్రశ్నించారు. ఇప్పుడు సీబీఐ అధికారులు కూడా తనను ప్రశ్నించే అవకాశం ఉండటంతో రియా, తన తరుపు లాయర్లు కావాలని సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!