అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్గా చేసుకొని వైసిపి రాజకీయాలు చేస్తున్నదని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైసెక్యురిటీ జోన్లోకి డ్రోన్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు డిజిపి గౌతం సవాంగ్ అపాయింట్మెంట్ కొరకు ఉదయం నుండి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో గుంటూరులో ఐజిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఉమ తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబును ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని ఉమ అన్నారు. ఫ్లడ్ మానిటరింగ్ చేయడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఉమ విమర్శించారు. గతంలో 12లక్షల క్యూసెక్కులపైగా వరద నీరు వచ్చినా లంక గ్రామాలు మునగలేదని ఉమ అన్నారు. గత ప్రభుత్వాలు ఫ్లడ్ మానిటరింగ్ సక్రమంగా చేశాయని ఉమ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు పట్టవని ఉమ విమర్శించారు. కేవలం చంద్రబాబు ఇల్లు ఎలా ఖాళీ చేయించాలన్నది వారి తాపత్రయమని ఉమ అన్నారు.
previous post
next post