TDP: తెలుగుదేశం పార్టీ తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న నాలుగు లోక్ సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాను కోరుకున్న భీమిలి దక్కించుకున్నారు.
తొలుత గంటా ను విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సూచించగా అందుకు గంటా అంగీకరించలేదు. విశాఖ జిల్లాలోనే తాను పోటీ చేస్తానని చంద్రబాబుకు గంటా చెప్పినట్లుగా సమాచారం. దీంతో చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే గంటాకు పార్టీ అధిష్టానం కేటాయించింది.
కాగా, కదిరి స్థానంలో అభ్యర్ధిని టీడీపీ మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా, ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పేరును వెల్లడించింది. ఇక సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించగా, ఆ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దీంతో ఆ ఇద్దరు నేతలకు పార్టీ వేరే చోట అవకాశం కల్పించింది.
చీపురుపల్లి అభ్యర్ధిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్ సభ కు కలిశెట్టి అప్పలనాయుడును బరిలో నిలిపింది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం కు గుంతకల్లు టికెట్ కేటాయించింది. అలానే పార్టీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు లోక్ సభ స్థానాన్ని కేటాయించింది.
లోక్ సభ అభ్యర్ధులు
- విజయనగరం – కలిశెట్టి అప్పలనాయుడు
- ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
- అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ
- కడప – భూపేష్ రెడ్డి
అసెంబ్లీ అభ్యర్ధులు
- చీపురుపల్లి – కళా వెంకట్రావు
- భీమిలి – గంటా శ్రీనివాసరావు
- పాడేరు – కే వెంకట రమేష్ నాయుడు
- దర్శి – గొట్టిపాటి లక్ష్మి
- రాజంపేట – సుగవాసి సుబ్రమణ్యం
- ఆలూరు – వీరభద్ర గౌడ్
- గుంతకల్లు – గుమ్మనూరు జయరాం
- అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
- కదిరి – కందికుంట వెంకట ప్రసాద్
Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు