సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. కరోనా కారణంగా దాదాపు 8-9 నెలలనుంచి థియేటర్స్ మూతపడటంతో బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడలేకపోయారు సినీ ప్రేమికులు. ఎంత ఓటీటీ ప్లాట్ ఫాంస్ అందుబాటులో ఉన్నా డీటీఎస్ థియేటర్స్ లో వందల మంది జనాల మధ్య, అభిమానుల మధ్య సిల్వర్ స్క్రీన్ మీద సినిమా చూడటం లో ఉండే ఎంజాయ్ మెంట్.. మాటల్లో చెప్పలేనిది. ఆ ఆనందాన్ని ఇన్ని నెలలు ప్రతీ ఒక్కరు మిస్ అయ్యారు. ఎట్టకేలకి మెగా మేనల్లుడు సాయితేజ్ తన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మళ్ళీ ఈ రోజు థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు.
ఇన్ని నెలల తర్వాత థియేటర్స్ లో రిలీజైన ఫస్ట్ సినిమా సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ కావడం ఇప్పుడు ఈ సినిమాకి కలిసివచ్చే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకుంటున్నారు. చెప్పాలంటే నిజంగా సాయితేజ్ సోలో బ్రతుకే సో బెటర్ కి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకి ఇండస్ట్రీ మొత్తం మద్దతుగా నిలిచింది. ప్రతీ హీరో సాయితేజ్ గట్స్ కి మెచ్చుకుంటున్నారు. అలాగే శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ కూడా వచ్చేసింది.
ఎటొచ్చి 50 శాతం ఆక్యుపెన్సీ విషయం ఒక్కటే కాస్త ఆలోచించాల్సింది. అయితే బుకింగ్స్ పరంగా చూస్తే కొన్ని చోట్ల థియేటర్స్ హౌజ్ ఫుల్ కూడా అయ్యాయట. ఈ లెక్కన చూస్తే సాయితేజ్ సోలో బ్రతుకే సో బెటర్ గ్యారెంటిగా మంచి వసూళ్ళు రాబట్టడం ఖాయం అంటున్నారు. అంతేకాదు ఇక సంక్రాంతి సందడి సాయితేజ్ తోనే మొదలైందని మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు .. ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో. కాగా రవితేజ క్రాక్ సినిమా జనవరి 14 న థియేటర్స్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎనర్జిటిక్ హీరో రాం కూడా తన మాస్ ఎంటర్టైనర్ రెడ్ సినిమాని సంక్రాంతి కి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!