విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు వ్యవహారం.. ఇంకా తేలలేదు. ఇటు అధికార వైసీపీ, అటు ప్రతి పక్ష టీడీపీ-జనసేన కూటమి నుంచి అభ్యర్థుల విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతోంది. ఒకవైపు.. అభ్యర్థిని ప్రకటించామన్న ఆనందం వైసీపీలో ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి కొన్నాళ్ల కిందటే స్థానిక కార్పొరేటర్, మైనారిటీ నాయకుడు షేక్ ఆసిఫ్ను ప్రకటించారు. ఇప్పటికే ఆయన నియోజకవ ర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారు.
అయితే చివరి నిమిషంలో ఆసిఫ్ స్థానంలో మరొకరు బరిలో నిలిచే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన టెన్షన్ టెన్షన్గానే ఉన్నారు. అధిష్టానం కూడా ఆయనకు భరోసా కల్పించలే కపోతోంది. టీడీపీ-జనసేన మిత్రపక్షం ఇక్కడ ఎంపిక చేసే అభ్యర్థిని బట్టి.. వైసీపీనిర్ణయం ఉంటుందనే చర్చ సాగుతోంది. మరోవైపు.. టీడీపీ తరఫున టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. ప్రస్తుతానికి మెత్తబడినట్టు కనిపిస్తున్నా.. తెరచాటున తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తున్నారు.
తాజాగా ఆయన తన అనుచరులతో ఇంట్లోనే భేటీ అయ్యారు. ఏం చేయాలన్న దానిపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఇక, వైసీపీ కూడా ఆయన వస్తానంటే వీరతాడు వేసేందుకు రెడీగా ఉంది. దీంతో జలీల్ ఖాన్ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక, జనసేన నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న పోతుల వెంకట మహేష్ వ్యవహారం కూడా .. ఎటూ తేలడం లేదు. ఈయనకు కూడా పార్టీ నుంచి ఎలాంటి అభయం రాలేదు. దీనికి ప్రధాన కారణం బీజేపీనేనని అంటున్నారు.
విజయవాడ నుంచి ఆ పార్టీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తే.. పశ్చిమ ను ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో కాదని అనలేని పరిస్థితి జనసేనకు ఉంది. ఈ నేపథ్యంలో వెంకట మహేష్ వ్యవహారాన్ని పెండిం గులో పెట్టారు. ఇలా.. మూడు పార్టీలు కూడా విజయవాడ పశ్చి మ నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆశావహులు.. ఇప్పటికే ఇంచార్జులుగా ఉన్నవారు తర్జన భర్జన పడుతున్నారు. ప్రజలను కలుస్తున్నా.. టికెట్పై మాత్రం భరోసా లేకుండా ఉండడంతో అన్యమనస్కంగానే వారు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం.