కరోనా విజృంభణ..లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5-6 నెలలకు పైగానే టాలీవుడ్ లో విడుదల కావాల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. అనుష్క నిశ్శబ్ధం, నాని వి, రాం రెడ్, సోలో బ్రతుకే సో బెటర్ ..ఇలా చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి మరికొన్ని నెలల వరకు థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో జనాలు కూడా ఓటిటిలకు అలవాటు పడిపోయారు. వర్మ ఏటీటీ తో పాటు ఓటీటీ లలో రిలీజ్ అవుతున్న సినిమాలను చూసేందుకు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఇటీవల దిల్ రాజు నాని వి సినిమాని అమెజాన్ ప్రైం లో రిలీజ్ చేశాడు. రిజల్ట్ విషయం పక్కన పెడితే ఈ సినిమాని జనాలు బాగానే చూశారు.
ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి సంస్థలు రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాల రిలీజ్ హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా ఓటీటీలో వచ్చేయనుందని తాజా సమాచారం. ఈ సినిమాలో మాధవన్, అంజలి, శాలినీ పాండే ప్రధాన పాత్రలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ మల్టీ లాంగ్వేజ్ లో ఈ సినిమాని నిర్మించాడు.
కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కు ఒక డేట్ ను కూడా లాక్ చేసినట్టు సమాచారం. ‘నిశ్శబ్దం’ డిజిటల్ ప్రీమియర్ గా వచ్చే అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమా మొత్తం 5 భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా రిలీజ్ అయ్యాక అనుష్క ప్లాన్ ఎలా ఉంటాయన్న ఆసక్తి గత కొన్ని రోజులుగా అందరిలోను నెలకొంది. ఆ మద్య ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వస్తే ఇంటరెస్ట్ లేదని నిర్మొహమాటంగా చెప్పిందని చెప్పుకున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమో తెలీదు గాని తన నెక్స్ట్ సినిమా మాత్రం గౌతం మీనన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయో సినిమా అని వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని వాటి గురించి ‘నిశ్శబ్దం’ రిలీజ్ అయ్యాక క్లారిటి ఇవాలని అనుష్క అనుకుంటుందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!