అక్కినేని అఖిల్..ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాడు. కాని ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవలేదు. ఇదే అక్కినేని ఫ్యాన్స్ లో ఉన్న పెద్ద అసంతృప్తి. అయితే ఈ సారి బిగ్గెస్ట్ హిట్ ఇస్తా అంటున్నాడు అఖిల్. విక్రం కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమాలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. కేవలం రెండు నిముషాలు కనిపించి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఈ సినిమాలో ఇచ్చిన ఎంట్రీకి అందరూ అఖిల్ ని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా చూస్తామా అంటూ తెగ ఆరాట పడ్డారు. అన్నట్టుగానే నితిన్.. అఖిల్ గ్రాండ్ గా లాంచ్ చేశాడు. అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమయిన ఈ అక్కినేని అందగాడు… ఈ సినిమా తర్వాత హలో, మిస్టర్ మజ్ఞు సినిమాలు చేశాడు.
అయితే ఈ మూడు సినిమాలు ఊహించినంతగా హిట్ కాలేదు. దాంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సస్ అందుకోవాలన్న కసితో నాలుగో సినిమాగా రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని జీఏ2 బ్యానర్ లో..బన్ని వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ లో ఉండగానే అఖిల్ తన 5వ సినిమాని ప్రకటించాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు.
తాజాగా అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి – అనిల్ సుంకర ల కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్ అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వగా కొతమందికి మాత్రం చిన్న షాకిచ్చిందంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ రాగానే చిన్న టెన్షన్ మొదలైందని అంటున్నారు. అందుకు కారణం హరిష్ శంకర్ తో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా సమాంతరంగా సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలనుకున్నారట. కాని ముందు అఖిల్ సినిమానే మొదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. చూడాలి అధికారక ప్రకటన వచే వరకు ఏం జరుగుతుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!