విమానంలో ప్రయాణం అనగానే ఎగిరి గంతేస్తుంటారు చాలా మంది. జీవితంలో ఒక్క సారైనా విమానం ఎక్కాలని కలలు గంటుంటారు మధ్య కుటుంబాలు. కుటుంబాల అవసారాల భారంతో చాలా మంది విమానం ఎక్కాలనే కోరిక ఒక కళగానే మిగిలిపోతుంటుంది. మరికొంత మంది విమానం ఎక్కాలనే కోరికతో డబ్బులను వెనకేసే పనిలో పడిపోతుంటారు. మరి కొంత మంది విమానం ఎక్కే అధృష్టం ఎలాగు లేదు.. కనీసం చూడనైనా చూస్తానంటూ విమానాశ్రయాలకు వెళ్లి ఆనందిస్తుంటారు. కాని ఒక యువతి మాత్రం ఏకంగా టికెట్ లేకుండానే విమానం ఎక్కేసిందండోయ్..
అరే టిక్కెట్టు లేకుండా విమానం కూడా ఎక్కనిస్తారా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అస్సలు టికెట్ లేకుండా ఎక్కించుకునేందుకు విమానాలు ఇంకా అలాంటి సర్వీసులను కూడా ఏం తీసుకురాలేదులెండి.. కాకపోతే టికెట్టు లేకుండా ఎక్కిన ఈ యువతి మాత్రం అధికారుల కన్నులు గప్పి విమానం చటుక్కున ఎక్కేసింది. ఈ ఘటన చికాగోలోని ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గత ఆదివారం జరిగింది. విమానాశ్రయంలో అడుగడుగునా అధికారులు గస్తీ కాస్తూ ఉంటారు. అక్రమంగా ఒక వస్తువును కూడా తీసుకుపోలేము విమానాశ్రయంలోకి.
అలాంటిది ఒక యువతి ఏకంగా విమానంలోకి ఎక్కేసిందే మామూలు మాటలు కాదేమో కదా.. అమెరికాలో యాజ్మినా పేటన్(23) అనే యువతి కనీసం అధికారులకు కూడా చిక్కకుండా విమానం ఎక్కేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం టికేట్ గేట్ వద్ద ఈ యువతి చాలా సేపు వెయిట్ చేసింది. కాని మంచి టైం కోసం ఎదురు చూస్తున్నఈ యువతి అధికారులు అప్రమత్తంగా లేని టైంలో టెర్మినల్ 3 బోర్డింగ్ ద్వారా విమానం ఎక్కేసింది.
కాగా ఈ యువతి విమానం ఎక్కిన తర్వాత టికెట్ లేదా బోర్డింగ్ పాస్ చూపించకపోవడంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు పేటన్ ను సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఆ సందర్భంగా ఆమె అమెరికన్ ర్యాపర్ జేజీని చూసేందుకు విమానం ఎక్కానని తెలిపింది. అలాగే ఈమె తరఫు న్యాయవాది వాధిస్తూ ఆమె కొన్ని రోజుల నుంచి యాంక్సైటీ డిసార్డర్, పీబీఎస్ డీతో బాధపడుతున్నట్టు కోర్టును తెలిపాడు. ఈ సందర్భంగా కోర్టు ఆమె చేసిన నేరానికి గానూ 500 డాలర్ల జరిమానా విధించారు. అలాగే ఇకనుంచి ఓ హేర్ ఎయిర్ పోర్టుకు వెళ్లకుండా నిషేధం విధించారు.