డార్లింగ్ ప్రభాస్ అంటేనే ఒక బ్రాండ్ లాగా మారారు. ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారారు ఈయన. చిన్న చిన్న సినిమాల నుంచి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ భారీ బడ్జెట్ సినిమాలకు వెళ్లే అవకాశాలను చేరుకున్నారు హీరో ప్రభాస్.. బాహుబలి సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ప్రభాస్ నటన, సాహసం ప్రేక్షకులను అబ్బురపచాయి.
ఈ మూవీకి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఈ బాహుబలి పలు భాషల్లోకి వచ్చి ఎంతో మురిసి కట్టిపడేసింది. దీంతో హీరో ప్రభాస్ కు భారీ స్థాయిలో ఉండే సాహో లో చాన్స్ దక్కింది. కాగా ఈ మూవీ అన్ని లాం గ్వేజీలో తెరకెక్కింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆశించన ఫలితాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ మూవీతో అభిమానులు కూడా చాలానే ఫీలయ్యారు.
కాగా దీని తర్వాత మరో భారీ సినిమాతో తెరముందుకు! రాబోతున్నారు ప్రభాస్.. అదేనండి ప్యాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’ మూవీలో ప్రభాస్ హీరోగా!కే నటించబోతున్నారు. ఈ మూవీకి జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీలో హీరో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ పై విడుదల కానుంది.
రాధేశ్యామ్ చిత్రంలో భాగంగా ఈ చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో హైదారాబాద్ షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ షెడ్యూల లో క్లైమాక్స్ కోసం సుమారుగా 30 కోట్ల ఖర్చుపెట్టి సెట్స్ తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో యాక్షన్ కంటే ప్రేమ సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయని ఓ సందర్భంగా ప్రభాస్ తెలిపారు. అయితే ఈ మూవీకి గ్లాడియేటర్ కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. మరీ 30 కోట్లతో భారీ సెట్స్ కి ప్లాన్ చేస్తున్నారంటే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.