అఖిల్ అక్కినేని మంచి కమర్షియల్ హిట్ కోసం తపన పడుతున్న సంగతి తెలిసిందే. అఖిల్, హలో, మిస్టర్ మజ్ఞు సినిమాలతో హీరో మెటీరియల్ అనిపించుకున్నప్పటికి భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. వరసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం akhil నాలుగో సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే akhil కి జంటగా నటిస్తోంది.
ఈ సినిమాని జీఏ2 బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సక్సస్ అన్నది హీరో akhil తో పాటు దర్శకుడు bommarillu bhaskar కి చాలా కీలకం. అందుకే ఈ సినిమాని ఎంతో కసితో చేస్తున్నారు. ఇక akhil ఈ సినిమా తర్వాత తన 5 వ సినిమాని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కాగా akhil కోసం తెలుగువారైన దర్శక ద్వయం రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే సినిమా చేసేందుకు టాలీవుడ్ కి రాబోతున్నారని సమాచారం. రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెలుగు వారైనప్పటికి బాలీవుడ్ లో వరసగా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా samantha అక్కినేని రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే ల దర్శకత్వంలో ” ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ” చేసింది. ఈ క్రమంలో దర్శకుల తో సమంత కి మంచి బాండింగ్ ఏర్పడటంతో ఇప్పుడు అఖిల్ తో రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే లు సినిమా చేసేలా సన్నాహలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ లో ఈ సినిమా ని నిర్మించబోతుందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!