Venkatesh : వెంకటేష్ Venkatesh నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిన్నా మొన్నటి వరకు రెండు సినిమాలు మాత్రమే విక్టరీ వెంకటేష్ నుంచి వస్తున్నాయని అందరు అనుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన నారప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ప్రియమణి హీరోయిన్ గా నటించింది. తమిళంలో సూపర్ హిట్ సినిమా అసురన్ కి తెలుగులో రీమేక్ గా నారప్ప రూపొందుతోంది. ఇక ఈ సినిమా మే28 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వెంకటేష్ కి రీమేక్ కింగ్ అన్నపేరుంది కాబట్టి నారప్ప భారీ హిట్ ఖాయమని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎఫ్ 3 తో రాబోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరొక హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
Venkatesh : ఆగస్టు లోపే దృశ్యం 2 ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాలు కాకుండా తాజాగా దృశ్యం 2 సినిమా కమిటయ్యాడు. ఈ సినిమా కూడా సెట్స్ మీదకి రాబోతోంది. అంతేకాదు కేవలం 50 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు లోపే దృశ్యం 2 ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మీనా హీరోయిన్ గా నటించబోతుండగా రానా దగ్గుబాటి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ ఏడాది మూడు సినిమాలను వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు వెంకటేష్. ఇక ఈ ఏడాది చివరిలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!