టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని టాప్ డైరెక్టర్లలో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకున్న రీతిలో తన సినిమాలు ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా పంచ్ డైలాగులు సరైన రీతిలో సిల్వర్ స్క్రీన్ పై పేలేలా తన మార్కు ఉండేలా.. సినిమా చూసే ప్రేక్షకుడు పొట్ట చెక్కలు అయ్యే నవ్వులు కలిగేలా రాస్తుంటాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది “అల వైకుంఠపురం లో” సినిమా ద్వారా అదిరిపోయే హిట్ అందుకొని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులు పగలగొట్టడం జరిగింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న త్రివిక్రమ్ సరికొత్త ఫార్ములాతో రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళితే గత కొంత కాలం నుండి తన సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా రిపీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. “అరవింద సమేత వీర రాఘవ”, “అల వైకుంఠ పురంబులో” సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా పెట్టి మంచి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు. దీంతో ఈసారి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం మళ్లీ పూజ ని తీసుకోవడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ తో చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టులో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నట్లు, రష్మిక మందన ని హీరోయిన్ గా తీసుకో బోతున్నారట. అంతకుముందు సమంతా ని రిపీట్ చేసిన త్రివిక్రమ్ తర్వాత ఆమెకు పిలవడంతో పూజా హెగ్డే ని రిపోర్ట్ చేయగా తాజాగా ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు రష్మిక మందన ని ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో త్రివిక్రమ్ హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!