కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. కొంత అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న రాత్రి రిపోర్టులు వచ్చినట్లు ఆయన తెలియజేసారు.
ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శ్రీపాద్ నాయక్, ధర్మేంద్ర ప్రదాన్ మొదలగు పలు మందికి కరోనా పాజిటివ్ సోకిన విషయం తెల్సిందే. ఇందులో కొందరు కోలుకోగా మరికొంత మంది ఇంకా కోలుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్నారు. ప్రహ్లాద్ సింగ్ పటేల్ మధ్యప్రదేశ్లోని దమోహ్ లోక్సభ స్థానం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఆయన ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ప్రహ్లాద్ సింగ్ పటేల్ సూచించారు.