UP Elections 2022: యూపితో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల సంఘం రీసెంట్గా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీ పార్టీ నుండి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మంత్రిపదవికి కూడా రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అనందీబెన్ పటేల్ కు పంపించారు.
UP Elections 2022: ఆ వర్గాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది, అందుకే..
“ప్రతికూల పరిస్థితులు, భిన్నమైన సైద్దాంతిక దృక్పదం మధ్య ఉన్నా కేబినెట్ మంత్రిగా నా బాధ్యతలు ఇప్పటి వరకూ నిబద్దతోనే నిర్వహించాను. దళితులు, వెనుకబడిన వర్గాలు యువకులు, నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది. ఈ కారణంగానే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను” అంటూ స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీని వీడిన స్వామి మౌర్య..అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే స్వామి ప్రసాద్ సహా ఆయన కార్యకర్తలు, మద్దతుదార్లను ఎస్పీలోకి ఆహ్వానిస్తున్నాను, స్వామి ప్రసాద్ ఈ నెల 22న మా పార్టలోకి చేర్చుకుంటాము” అని ట్వీట్ చేశారు.
ఎస్పీలోకి రెండో సారి
స్వామి ప్రసాద్ మౌర్య గతంలో సమాజ్ వాదీ పార్టీని వీడి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీలో చేరారు. ఆ తర్వాత మయావతి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ సమాజ్ వాదిలో చేరారు. అనంతరం ఎస్పీని వీడి బీజేపీలో చేరిపోయారు. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన మౌర్యకు ఆ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఈ కారణంగా యోగి మంత్రి వర్గంలో కార్మిక శాఖ అప్పగించారు.
सामाजिक न्याय और समता-समानता की लड़ाई लड़ने वाले लोकप्रिय नेता श्री स्वामी प्रसाद मौर्या जी एवं उनके साथ आने वाले अन्य सभी नेताओं, कार्यकर्ताओं और समर्थकों का सपा में ससम्मान हार्दिक स्वागत एवं अभिनंदन!
सामाजिक न्याय का इंक़लाब होगा ~ बाइस में बदलाव होगा#बाइसमेंबाइसिकल pic.twitter.com/BPvSK3GEDQ
— Akhilesh Yadav (@yadavakhilesh) January 11, 2022