Uppena : ఉప్పెన .. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా.. కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠిస్తూ ఇన్నేళ్ళుగా చెక్కు చెదరని రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన డెబ్యూ సినిమా ‘చిరుత’ ఇప్పటి వరకు టాలీవుడ్లో అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ తన లైఫ్ టైమ్ రన్లో వసూలు చేసిన మొత్తాన్ని వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ తొలి వారంలోనే దాటేసింది.
అందరూ అనుకున్నట్టుగానే ఉప్పెన సినిమా తొలి వారం ముగిసే సరికి ‘చిరుత’ రికార్డును తిరగరాసింది. అంతే కాదు.. ‘ఉప్పెన’ ఇప్పుడు ఆల్ ఇండియా రికార్డ్ను కూడా బ్రేక్ చేసింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును ఉప్పెన బద్దలుకొట్టింది. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్గా ఉప్పెన నిలిచింది. ఈ రికార్డు గతంలో హృతిక్ రోషన్ నటించిన డెబ్యూ సినిమా కహో నా ప్యార్ హై పేరు మీదే ఉండింది. ఈ సినిమా ఫుల్ రన్లో రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. అయితే ఉప్పెన ఐదు రోజుల్లోనే రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి కహో నా ప్యార్ హై రికార్డు ను బ్రేక్ చేసింది.
Uppena : ఉప్పెన తో వైష్ణవ్ తేజ్ ఊహించని టార్గెట్ ని ఫిక్స్ చేశాడు.
ఈ దెబ్బతో రాబోయే కొత్త హీరోలకు వైష్ణవ్ తేజ్ ఊహించని టార్గెట్ ని ఫిక్స్ చేశాడు. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ చేసే వాళ్ళు ఇండస్ట్రీకి రావడం కష్టమే అంటున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ నటించిన రెండవ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కొండపొలం అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే వైష్ణవ్ తేజ్ అన్నపూర్ణ బ్యానర్ లో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తాజా సమాచారం. నాగార్జున నిర్మాత గా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!