YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. గత కొద్దికాలంగా తనను ఇరుకున పెడుతున్న అంశంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు.. ఈ తరుణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకవైపున చేయాల్సినవన్నీ చేస్తాం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పెడతామని తెలిపారు. తద్వారా బాల్ కేంద్రం కోర్టులోకి నెట్టారు.
YS Jagan జగన్ భలే మాట చెప్పారే…
విశాఖ స్టీల్ప్లాంట్కు చేయాల్సిందంతా చేస్తాం.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు .
కార్మికుల ఆందోళనల వల్ల ప్లాంటు మూతబడింది, ఉత్పత్తి సరిగ్గా జరగడంలేదన్న మాట అవతలివాళ్ల నుంచి రానీయకుండా చూసుకోండి అని సూచించిన ఆయన.. విరామం సమయంలో మాత్రమే ధర్నాలు, ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒడిశా రాష్ట్రంలో ఈ ప్లాంటుకు సొంతంగా గని కేటాయించాలని, ఆ రాష్ట్రంలో పుష్కలంగా ఇనుపఖనిజం నిల్వలు ఉన్నాయని చెప్పామని గుర్తు చేశానారు. మనం ప్రయత్నాలు చేసి ఈ గనులనుంచి ఖనిజాన్ని పొందేలా లీజులను పునరుద్ధరణ చేసుకోవాల్సిన అసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఒక సానుకూలమైన నిర్ణయం వస్తుందని గట్టిగా నేను నమ్ముతున్నానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
పోస్కో గురించి సైతం….
వైజాగ్ స్టీల్ విషయంలో కీలకమైన పోస్కో పై సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. పోస్కో వాళ్లు విశాఖ రావడానికి తీవ్రంగా యత్నిస్తున్నారన్నది సరికాదన్న సీఎం జగన్.. కృష్ణపట్నం, భావనపాడు, కడపల్లో ఎక్కడకు వచ్చినా పర్వాలేదన్నారు. పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, తనను కలవడం కూడా వాస్తవమేనన్న ఆయన.. కడప, కృష్ణపట్నం, భావనపాడు లాంటి చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని వారిని కోరినట్టు తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా పర్వాలేదని చెప్పాను.. కడప అయితే బాగుంటుందని కూడా వారికి చెప్పానని వెల్లడించారు. నిన్నకూడా వాళ్లు కృష్ణపట్నం వెళ్లారని.. కృష్ణపట్నం, భావనపాడుల్లో పెట్టేందుకు సీరియస్గా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.