దాదాపు అయిదు దశాబ్దాల పాటు తన గాత్రంతో అలరించిన గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ (82) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి మరణించారు. కోవిడ్ అనంతర సమస్యలతో పాటు కోలిన్ క్యాన్సర్ తో ఆయన బాధపడుతూ ముంబాయి అసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దిగ్గజ గాయకులైన మహమ్మద్ రఫీ, ఆర్డీ బర్మాస్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, గల్జర్ లకు సమకాలీకుడు భూపీందర్ సింగ్. ఆయన భార్య ప్రముఖ గాయకురాలు మిథాలీ సింగ్. ధరమ్ కాంటా చిత్రంలోని ధునియా చూటే.. యార్ నా ఛూటే, సితారా తిత్రంలో థోడీ సీ జమీస్ థోఢా అస్మాన్ పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నామ్ గుమ్ జాయేగా, దిల్ థూండ్తా హై.. మరిచిపోలేని క్లాసిక్స్ గా నిలిచిపోయాయి.
భూపీందర్ సింగ్ ఢిల్లీలో సింగర్ ఆల్ ఇండియా రేడియోలో కేరీర్ ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మదన్ మోహన్ దృష్టిలో పడి సినిమా అవకాశాలు అందుకున్నారు. 1964 లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన హీఖీఖాత్ ఆయన తొలి చిత్రం. 1980లో సినిమాలకు మెల్లిగా దూరం అవుతూ వచ్చిన భూపీందర్ సింగ్ .. భార్య మిథాలీతో కలిసి ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు. ఆయన కేవలం గాయకుడిగానే కాకుండా గిటారిస్ట్ గా హరేరామా హరే కృష్ణ చిత్రంలో ధమ్ మారో ధమ్, యాదోస్ కీ భారాత్ మువీలో చురా లియా హై, చింగారి కోయ్ భద్కే, షోలే చిత్రంలో మోహబూబా ఓ మోహబూబా లాంటి సూపర్ హిట్ పాటలకు పని చేశారు. ఈ పాటల్లో గిటార్ మ్యూజిక్ లు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా భూపీందర్ సింగ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!