టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇప్పటి వరకు తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. అయితే గత కొంతకాలంగా శర్వాను సరైన సక్సెస్ దక్కడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గత చిత్రం జాను కూడా తీవ్రంగా నిరాశపరచింది. దాంతో ఈసారి భారీ హిట్ అందుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించడానికి శర్వానంద్ రెడీ అవుతున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తి అయ్యినట్లు సమాచారం.
ఇక త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కేందుకు సర్వం సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా సినిమా వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే అనుపమ పరమేశ్వరణ్, పాయల్ రాజ్ పుత్, దివ్యాంశ కౌశిక్ పేర్లు పరిశీనలో ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. కాగా తాజాగా అందాల భామ ఐశ్వర్యా రాజేష్ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. అయితే ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. కాని ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఐశ్వర్య. అయితే ఈ రెండు సినిమా లు ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాయి. దానికి తోడు తన అకౌంట్ లో ఈ మద్య మంచి సక్సస్ లు లేవు. అయినా ఈ బ్యూటీకి అవకాశం రావడం గొప్పేనని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా లో ఐశ్వర్యా రాజేష్ పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ భూపతి ఇప్పటికే ఐశ్వర్యా రాజేష్ కి కథ కూడా చెప్పినట్టు సమాచారం. త్వరలో ఈ విషయంలో అధికారకంగా వెల్లడికానుందని తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!