గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన విజయశాంతి తన మాస్క్ తో అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆమె త్వరలో బిజెపి లో జాయిన్ అవడం గ్యారెంటీ అనే ప్రచారం ఎప్పటి నుండో తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికలు ముందు నుండి విజయశాంతి కమలం పార్టీ లోకి వెళ్ళటం గ్యారెంటీ అనే వార్తలు వస్తున్నా ఎక్కడా కన్ఫామ్ కాలేదు. అప్పట్లో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బండి సంజయ్ తో కూడా విజయ శాంతి చర్చలు జరిపినట్లు.. సరిగ్గా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు అప్పట్లో టాకు గట్టిగా వచ్చింది.
మీడియాలో కూడా వార్తలు వచ్చినా అది జరగలేదు. ఆ తర్వాత ఆదివారం అమిత్ షా హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి విజయశాంతి రావడం గ్యారెంటీ అని చాలామంది కామెంట్లు చేశారు. ఎక్కడా కూడా విజయశాంతి బిజెపిలో చేరలేదు. ఇదే తరుణంలో వస్తున్న వార్తలపై విజయశాంతి కూడా పెద్దగా స్పందించలేదు. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గానీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా పాల్గొన్న సందర్భాలు లేవు. ఇటువంటి తరుణంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన విజయశాంతి కాషాయరంగు మాస్కులు ధరించడం తో ఇక డౌటే లేదు ఆమె బీజేపీ లోకి వెళ్ళిపోవటం గ్యారెంటీ అని తెలంగాణ రాజకీయవర్గాలలో టాక్ వస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 7వ తారీఖున విజయశాంతి ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు. దీంతో కచ్చితంగా రాములమ్మ కాషాయ జెండా కప్పుకోవడం గ్యారెంటీ అని పరిశీలకుల మాట.