Visakha: విశాఖపట్నంలో రూ.2 వేల నోట్ల మార్పిడి ముఠా వద్ద డబ్బులు కాజేసిన ఏఆర్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత సహా మరో ఇద్దరు హోం గార్డులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశంలో తెలియజేశారు. రిటైర్డ్ నావీ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్ లు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారు. రూ.90 లక్షల విలువైన రూ.500ల నోట్లు ఇస్తే.. కోటి విలువైన రూ.2వేల నోట్సలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే నగదు మార్పిడిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మద్యవర్తి సూరిబాబు .. ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పని చేస్తున్న శ్యామ్ సుందర్, శ్రీనులను ఆశ్రయించారని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.
అయితే ఆ తర్వాత హోంగార్డులు సూరిబాబుని బెదిరించి రూ.10లక్షల ఒప్పందాన్ని రూ.20 లక్షలకు తీసుకువెళ్లారనీ, ఆ మొత్తాన్ని స్వర్ణలత సహా అందరూ పంచుకున్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. ఈ నోట్ల మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నతర్వాత స్వర్ణలత డ్రైవర్లు మద్యవర్తి సూరిని కొట్టారనీ, టాస్క్ ఫోర్స్ కు చెబితే మొత్తం సొమ్ము పోతుందని బెదిరించి కమిషన్ ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. బాధితులు డీసీపీకి ఫిర్యాదు చేయడంతో మద్య వర్తి సూర్తి ఏ 1గా, హోంగార్డులు ఏ2, ఏ 3గా, స్వర్ణలత ఏ 4 గా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. రూ.2వేల నోట్ల మార్పిడికి సెప్టెంబర్ నెలాఖరు వరకూ గడువు ఉన్నందున ఎవరకూ మద్యవర్తుల మాటలు నమ్మి వారిని ఆశ్రయించవచ్చని సీపీ సూచించారు.
Food Poison: 70 మంది హాస్టల్ విద్యార్ధినుల అస్వస్థత .. తల్లిదండ్రుల్లో ఆందోళన