WTC Final: న్యూజిలాండ్తో ఈనెల 18వ తేదీన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం భారత్ ఇప్పటికే ఇంగ్లాండ్ లో తీవ్రంగా నెట్స్ లో శ్రమిస్తోంది. నిన్నే భారత్ క్రికెట్ జట్టు రెండు టీంలు గా విడిపోయి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడారు. ఈలోపల న్యూజిలాండ్… ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ గెలిచి భారత్ తో ఫైనల్ కోసం పూర్తిగా సంసిద్ధం అయింది.
ఇక ఇంగ్లాండ్ పిచ్ లు అంటే పేసర్లకు స్వర్గధామం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి భారత పేస్ దళం పూర్తి స్థాయిలో రెడీ గా ఉండాల్సిందే. అయితే తుది జట్టులోకి ఈమధ్య అనూహ్యమైన ఫామ్ తో సత్తా చాటుతున్న మహమ్మద్ సిరాజ్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు పలు రిపోర్టులు వచ్చాయి. ఖచ్చితంగా మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉండేలాగా యాజమాన్యం చూస్తోందని చెబుతున్నారు.
అయితే సిరాజ్ జట్టు లోకి వస్తే అతని కోసం ఇషాంత్ శర్మ, షమీ లేదా జడేజా లలో ఎవరో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. మామూలుగా ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి భారత్ పేస్ దళాన్ని గత పది సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. అయితే సిరాజ్ ఆస్ట్రేలియా టూర్ లో సత్తా చాటడంతో పాటు భారత్ సిరీస్ గెలిచి టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పైగా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కూడా బ్యాట్స్మెన్ పై పదునైన బంతులు సంధించాడు.
ఇక దాదాపు సిరాజ్ కోసం ఇశాంత్ శర్మ బెంచ్ కి పరిమితం కాక తప్పదు అని అంటున్నారు. అయితే జడేజా రూపంలో రెండవ స్పిన్నర్ అవసరం లేదు… బ్యాటింగ్ బలోపేతం గానే ఉంది అనుకుంటే అశ్విన్ ఒక్కడిని ఆడించి ఇషాంత్, సిరాజ్ లతో సహా నలుగురు పేసర్ లతో భారత్ బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి 18వ తేదీన తుది జట్టు ఎంపిక విషయమై ఈ కోణంలో విపరీతమైన నడుస్తోంది.